ఏపీలో కొత్తగా 137 కరోనా పాజిటివ్ కేసులు

ఏపీలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా గడిచిన 24 గంటల్లో 48,313కరోనా టెస్టులు చేయగా, 137 కరోనా కేసులు నమోదు అయ్యాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,86,694కి చేరింది. అటు గడిచిన 24 గంటల వ్యవధిలో కరోనా చికిత్స పొందుతూ అనంతపురం, గుంటూరు, కర్నూలు, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు. దీనితో మరణించిన వారి సంఖ్య 7,146కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 167 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా 8,75,165 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,488గా ఉంది. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది.
#COVIDUpdates: 22/01/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) January 22, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 8,83,799 పాజిటివ్ కేసు లకు గాను
*8,75,165 మంది డిశ్చార్జ్ కాగా
*7,146 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,488#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/wwHmu2EhZf
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com