ఏపీలో కొత్తగా 173 కరోనా కేసులు!

ఏపీలో కరోనా కేసులు మళ్ళీ పెరిగాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 46,852 టెస్టులు చేయగా, 173 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,86,418కి చేరింది. ఇందులో 1,637 యాక్టివ్ కేసులుండగా, 8,77,639మంది కరోనా నుంచి కోలుకున్నారు. అటు గడిచిన 24 గంటల వ్యవధిలో కరోనాతో ఎలాంటి మరణం సంభవించలేదు. ఇప్పటివరకు రాష్ట్రంలో కొవిడ్తో 7,142 మంది మరణించారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,26,90,165 పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
#COVIDUpdates: 20/01/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) January 20, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 8,83,523 పాజిటివ్ కేసు లకు గాను
*8,74,744 మంది డిశ్చార్జ్ కాగా
*7,142 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,637#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/WHYPeOhiAq
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com