18 మందిని వదిలేసి వెళ్లిన ఎయిర్ ఇండియా ఫ్లైట్

X
By - Subba Reddy |29 March 2023 1:15 PM IST
గన్నవరం నుంచి కువైట్ వెళ్లాల్సిన ఈ ఫ్లైట్లో85 మంది ప్రయాణీకులు ఉండగా కేవలం 67 మందిని మాత్రమే తీసుకెళ్లినట్లు సమాచారం
గన్నవరం ఎయిర్పోర్టులో ఎయిర్ ఇండియా ఫ్లైట్ 18 మందిని ఎక్కించుకోకుండా వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. గన్నవరం నుంచి కువైట్ వెళ్లాల్సిన ఈ ఫ్లైట్లో గన్నవరం నుంచి 85 మంది ప్రయాణీకులు ఉన్నారు. కానీ కేవలం 67 మందిని మాత్రమే తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఉదయం 9.55కే వెళ్లిపోయినట్లు ఎయిర్ ఇండియా అధికారులు చెబుతున్నారు. మిగిలిన 18 మంది ఆలస్యంగా వచ్చారని వెనక్కిపంపారు ఎయిర్ ఇండియా సిబ్బంది. అయితే ఈ ఫ్లైట్ మ.1.10 నిమిషాలకు ఉందని టైం మార్చినట్లు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదంటున్నారు ప్రయాణీకులు. మరోవైపు టికెట్ ఛార్జీలు రిఫండ్ అవుతాయని సర్ధి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఎయిర్ ఇండియా అధికారులు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com