AP Corona cases : ఏపీలో కొత్తగా 2,209 కేసులు.. 22 మరణాలు

AP Corona cases : ఎపీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 81,505 టెస్టులు చేయగా కొత్తగా 2,209 కేసులు వెలుగు చూశాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 19,78,350కి చేరింది. అటు కరోనాతో మరో 22 మంది ప్రాణాలను కోల్పోయారు. దీనితో మొత్తం మృతుల సంఖ్య 13,490కి పెరిగింది. కృష్ణా జిల్లాలో ఆరుగురు, గుంటూరులో నలుగురు, చిత్తూరులో ముగ్గురు, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు, తూర్పుగోదావరి, కడప, శ్రీకాకుళం,విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. కాగా మరోవైపు 1,896 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 20,593 యాక్టివ్ కేసులున్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com