AP Corona cases : ఏపీలో కొత్తగా 2,224 కేసులు, 31 మరణాలు

AP Corona cases : ఏపీతో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత తగ్గుముఖం పట్టింది. ఒక్కరోజులో 71 వేల 758 శాంపిల్స్ పరీక్షించగా... 2 వేల 224 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. అలాగే 31 మంది వైరస్ కారణంగా మరణించినట్లు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
చిత్తూరు జిల్లాలో ఆరుగురు, కృష్ణా జిల్లాలో ఐదుగురు మృతి చెందారు. తూర్పు గోదావరి, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల్లో నలుగేసి మరణాలు నమోదయ్యాయి. ఇటు అనంతపురం, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో రెండేసి మరణాలు చోటు చేసుకోగా.... విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందినట్లు వైద్య శాఖ తెలిపింది.
ఇక ఇవాళ ఒక్క చిత్తూరు జిల్లాలోనే అత్యధికంగా 409 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తూర్పుగోదావరి జిల్లాలో 299, పశ్చిమగోదావరి జిల్లాలో 259, కృష్ణా జిల్లలో 222 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ఇక ఏపీలో రికవరీ రేటు కూడా మెరుగ్గానే ఉంది. 24 గంటల్లోనే 4 వేల 714 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు ప్రభుత్వం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com