AP Corona : ఏపీలో కొత్తగా 2,982 కరోనా కేసులు.. 27 మరణాలు..!

AP Corona : ఏపీలో కొత్తగా 2,982 కరోనా కేసులు.. 27 మరణాలు..!
AP Corona : ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది.. రాష్ట్రంలో రోజువారీ కేసులు మూడు వేల దిగువకు చేరాయి.

AP Corona : ఏపీలో కొత్తగా 2,982 కరోనా కేసులు.. 27 మరణాలు.. తాజాగా ఏపీలో 2వేలా 982 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా, 27 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 31వేలా 580 యాక్టివ్‌ కేసులు ఉండగా.. మరణాల సంఖ్య 12వేలా 946కు చేరింది.. గత 24 గంటల్లో ప్రకాశం జిల్లాలో కరోనాతో ఆరుగురు చనిపోయారు. కృష్ణా జిల్లాలో ఐదుగురు, చిత్తూరు, తూర్పుగోదావరి జిల్లాలో నలుగురు చొప్పున చనిపోయారు. అనంతపురం జిల్లాలో కరోనాతో ఇద్దరు మృతిచెందగా.. గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. గడిచిన 24 గంటల్లో తూర్పుగోదావరి జిల్లాలో 616 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.. చిత్తూరులో 401, పశ్చిమగోదావరిలో 363, ప్రకాశం జిల్లాలో 345 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. మొత్తంగా ఏపీలో 19 లక్షలా 14వేలా 213 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Tags

Read MoreRead Less
Next Story