ఏపీలో కొత్తగా 4,684 కరోనా కేసులు, 36 మరణాలు

X
By - TV5 Digital Team |23 Jun 2021 7:20 PM IST
ఏపీలో కొత్తగా 4 వేల 684 కరోనా కేసులు, 36 మరణాలు నమోదయ్యాయి. ఏపీలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 18లక్షల 62వేల 36కు చేరింది.
ఏపీలో కొత్తగా 4 వేల 684 కరోనా కేసులు, 36 మరణాలు నమోదయ్యాయి. ఏపీలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 18లక్షల 62వేల 36కు చేరింది. కరోనా మరణాల సంఖ్య 12వేల 452కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 51వేల 204 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఏపీలో ఇప్పటి వరకు మొత్తం 2 కోట్ల 13లక్షల 61వేల 14 షాంపిళ్లకు కరోనా పరీక్షలు నిర్వహించారు. 24 గంటల్లో కరోనా నుంచి 7వేల 324 మంది కోలుకున్నారు. చిత్తూరు జిల్లాలో 8 మంది చనిపోయారు. తూర్పూ గోదావరి, కృష్ణా జిల్లాలో ఐదుగురు చొప్పున మృతి చెందారు. అనంతపురం, నెల్లూరు, శ్రీకాకుళంలో ముగ్గురు చొప్పున చనిపోయారు.. కర్నూలు, ప్రకాశం, విశాఖలో ఇద్దరు చొప్పున, కడప, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒకరు చొప్పున మృతి చెందారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com