ACCIDENT: ఫోన్లు ఒక్కసారిగా పేలడంతో బస్సు దగ్ధం

ACCIDENT: ఫోన్లు ఒక్కసారిగా పేలడంతో బస్సు దగ్ధం
X
బస్సు లగేజీ క్యాబిన్‌లో వందలాది మొబైల్ ఫోన్లు... ఒక్కసారిగా పేలడంతో పెరిగిన ప్రమాద తీవ్రత

కర్నూలు జిల్లాలో జరిగిన వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు లగేజీ క్యాబిన్‌లో తరలిస్తున్న వందల మొబైల్‌ ఫోన్లు పేలడం వల్లే ప్రమాద తీవ్రత పెరిగి, భారీ ప్రాణ నష్టానికి దారితీసిందని ఫోరెన్సిక్‌ బృందాలు ప్రాథమికంగా గుర్తించాయి. ‘తొలుత బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టగానే దాని ఆయిల్‌ ట్యాంక్‌ మూత ఊడిపడి అందులోని పెట్రోల్‌ కారడం మొదలైంది. బస్సు కింది భాగంలో ద్విచక్రవాహనం ఇరుక్కుపోవడంతో, దాన్ని బస్సు కొంత దూరం ఈడ్చుకెళ్లింది. ఈ క్రమంలో నిప్పురవ్వలు చెలరేగడం, దానికి పెట్రోల్‌ తోడవడంతో మంటలు ప్రారంభమై పేలింది. ఈ సమయంలో లగేజీ క్యాబిన్‌లో తరలిస్తున్న 400కు పైగా మొబైల్‌ ఫోన్లతో కూడిన పార్సిల్‌ ఉండటంతో అధిక వేడికి ఆ ఫోన్ల బ్యాటరీలన్నీ ఒక్కసారిగా పేలాయి. ఆ మంటలు లగేజీ క్యాబిన్‌ పై భాగంలోని ప్రయాణికుల కంపార్ట్‌మెంట్‌కు వ్యాపించాయి.” అని ఫోరెన్సిక్ బృందాలు గుర్తించాయి.

కర్నూ­లు జి­ల్లా­లో ఘోర ప్ర­మా­దం చో­టు­చే­సు­కుం­ది. హై­ద­రా­బా­ద్ నుం­చి బెం­గ­ళూ­రు వె­ళ్తు­న్న వే­మూ­రి కా­వే­రి ట్రా­వె­ల్స్ బస్సు­లో మం­ట­లు చె­ల­రే­గా­యి. కర్నూ­లు శి­వా­రు చి­న్న­టే­కూ­రు­లో జా­తీయ రహ­దా­రి 44పై ఈ ఘోర ప్ర­మా­దం జరి­గిం­ది. ప్ర­మాద సమ­యం­లో బస్సు­లో ఇద్ద­రు డ్రై­వ­ర్లు, 41 మంది ప్ర­యా­ణి­కు­లు కలి­పి మొ­త్తం 43 మంది ఉన్నా­రు. వీ­రి­లో 19 మంది సజీవ దహనం కాగా.. 22 మంది స్వ­ల్ప­గా­యా­ల­తో బయ­ట­ప­డ్డా­రు. డ్రై­వ­ర్ల­లో ఒకరు పరా­ర­వ­గా.. మరొ­క­రు పో­లీ­సుల అదు­పు­లో ఉన్నా­రు.

ప్రమాదం ఇలా జరిగింది

హై­ద­రా­బా­ద్‌­లో­ని పటా­న్‌­చె­రు­లో ఉన్న ట్రా­వె­ల్స్ కా­ర్యా­ల­యం నుం­చి గు­రు­వా­రం రా­త్రి 9 గం­ట­ల­కు బెం­గ­ళూ­రు­కు వే­మూ­రి కా­వే­రి ట్రా­వె­ల్స్ బస్సు బయ­లు­దే­రిం­ది. శు­క్ర­వా­రం తె­ల్ల­వా­రు­జా­మున 3 గంటల సమ­యం­లో కల్లూ­రు మం­డ­లం చి­న్న­టే­కూ­రు వద్ద­కు రా­గా­నే బస్సు­లో మం­ట­లు చె­ల­రే­గా­యి. ఓ బై­క్‌­ను బస్సు ఢీ­కొ­ట్ట­డం­తో ఈ దు­ర్ఘ­టన జరి­గి­న­ట్లు తె­లు­స్తోం­ది. బస్సు కిం­ద­కు బైక్ దు­సు­కె­ళ్ల­డం­తో.. పె­ట్రో­ల్ లీక్ అయ్యి మం­ట­లు రా­జు­కు­న్న­ట్లు.. తర్వాత బస్సు మొ­త్తం వ్యా­పిం­చి­న­ట్లు ప్రా­థ­మి­కం­గా అం­చ­నా వే­శా­రు. ప్ర­మాద సమ­యం­లో గాఢ ని­ద్ర­లో ఉన్న ప్ర­యా­ణి­కు­లు తే­రు­కొ­ని హా­హా­కా­రా­లు చే­స్తూ కొం­ద­రు బయ­ట­ప­డ­గా, పలు­వు­రు మం­ట­ల్లో­నే చి­క్కు­కు­న్నా­రు.. పో­లీ­సు­ల­కు సమా­చా­రం రా­వ­డం­తో హు­టా­హు­టిన అక్క­డి­కి వె­ళ్లి సహా­యక చర్య­లు చే­ప­ట్టా­రు. గా­య­ప­డిన వా­రి­ని కర్నూ­లు సర్వ­జన ఆసు­ప­త్రి­కి తర­లిం­చా­రు. బస్సు మొ­త్తం పూ­ర్తి­గా కా­లి­పో­యిం­ది. ప్ర­యా­ణి­కు­ల్లో ఎక్కువ మంది హై­ద­రా­బా­ద్ నగ­రా­ని­కి చెం­దిన వారు ఉన్న­ట్లు సమా­చా­రం.

డోర్ హైడ్రాలిక్ వ్యవస్థ ఫెయిలైంది

బస్సు డోర్ తె­రు­చు­కో­క­పో­వ­డ­మే ఈ ప్ర­మా­దం­లో మృ­తుల సం­ఖ్య పె­ర­గ­డా­ని­కి కా­ర­ణం­గా తె­లు­స్తోం­ద­ని అధి­కా­రు­లు చె­బు­తు­న్నా­రు. ''­బ­స్సు ఇం­జి­న్‌­కు మం­ట­లు వై­ర్లు కా­లి­పో­వ­డం­తో డో­ర్స్ కు సం­బం­ధిం­చి హై­డ్రా­లి­క్ వ్య­వ­స్థ పా­డై­న­ట్లు­గా ప్రా­థ­మి­కం­గా తె­లు­స్తోం­ది. దీ­ని­వ­ల్ల బస్సు తలు­పు తె­రు­చు­కో­క­పో­వ­డం­తో కొం­ద­రు ప్ర­యా­ణి­కు­లు బయ­ట­కు వచ్చేం­దు­కు వీ­ల్లేక చని­పో­యా­రు­'' అని బీ­బీ­సీ­తో చె­ప్పా­రు కలె­క్ట­ర్ సిరి. గా­య­ప­డిన వా­రి­ని ప్ర­భు­త్వ ఆసు­ప­త్రి­కి తర­లిం­చి చి­కి­త్స అం­ది­స్తు­న్నా­మ­ని అన్నా­రు. ప్రై­వే­ట్ ట్రా­వె­ల్స్ బస్సు ప్ర­మాద బా­ధి­తు­లు, వారి కు­టుంబ సభ్యుల సహా­యా­ర్థం కం­ట్రో­ల్ రూ­మ్స్ ఏర్పా­టు చే­సి­న­ట్లు కలె­క్ట­ర్ డా­క్ట­ర్ ఎ.సిరి తె­లి­పా­రు.

Tags

Next Story