ACCIDENT: ఒకే రోజు.. మూడు బస్సు ప్రమాదాలు

ACCIDENT: ఒకే రోజు.. మూడు బస్సు ప్రమాదాలు
X
ప్రజలను వణికిస్తున్న బస్సు ప్రమాదాలు.. తెలుగు రాష్ట్రాల్లో మూడు బస్సు ప్రమాదాలు.. ఏలూరులో బోల్తా పడ్డ ప్రైవేట్ ట్రావెల్ బస్సు

తె­లు­గు రా­ష్ట్రా­ల్లో వరుస బస్సు ప్ర­మా­దా­లు ప్ర­యా­ణి­కు­ల­కు, ప్ర­జ­ల­కు కంటి మీద కు­ను­కు లే­కుం­డా చే­స్తు­న్నా­యి. కర్నూ­ల్, చే­వె­ళ్ల బస్సు ప్ర­మా­దా­ల­ను మర్చి­పో­క­ముం­దే మం­గ­ళ­వా­రం మరి­కొ­న్ని బస్సు ప్ర­మా­దా­లు జర­గ­డం­తో ప్ర­జ­లు వణి­కి­పో­యా­రు. మం­గ­ళ­వా­రం తె­ల్ల­వా­రు­జా­మున ఆం­ధ్ర ప్ర­దే­శ్ తో పాటు తె­లం­గా­ణ­లో­నూ బస్సు ప్ర­మా­దా­లు జరి­గా­యి.

ఏలూరులో బోల్తా పడ్డ బస్సు

ఏలూ­రు జి­ల్లా లిం­గ­పా­లెం­లో రో­డ్డు ప్ర­మా­దం జరి­గిం­ది. ఏలూ­రు నుం­చి హై­ద­రా­బా­ద్‌ వె­ళ్తో­న్న భా­ర­తి ట్రా­వె­ల్స్‌ బస్సు.. జూ­బ్లీ­న­గ­ర్‌ సమీ­పం­లో బో­ల్తా పడిం­ది.భా­ర­తి ట్రా­వె­ల్స్ బస్సు మా­ర్గ­మ­ధ్య­లో బో­ల్తా­ప­డిం­ది. ఈ ప్ర­మా­దం­లో ఇద్ద­రు మృ­తి­చెం­ద­గా పలు­వు­రి­కి తీ­వ్ర గా­యా­ల­య్యా­యి. ప్ర­మాద సమ­యం­లో బస్సు­లో డ్రై­వ­ర్‌, క్లీ­న­ర్‌ సహా 17 మంది ఉన్నా­రు. క్ష­త­గా­త్రు­ల­ను దగ్గ­ర్లో­ని ఆస్ప­త్రి­కి తర­లిం­చి చి­కి­త్స అం­ది­స్తు­న్నా­రు. ఎదు­రు­గా వస్తు­న్న ద్వి­చ­క్ర వా­హ­నా­న్ని ఢీ­కొ­న­డం­తో బస్సు అదు­పు తప్పి­న­ట్లు ప్ర­యా­ణి­కు­లు చె­బు­తు­న్నా­రు. బస్సు డ్రై­వ­ర్‌­ను అదు­పు­లో­కి తీ­సు­కు­న్న పో­లీ­సు­లు వి­చా­రి­స్తు­న్నా­రు. మృ­తు­డి­ని లిం­గ­పా­లెం మం­డ­లా­ని­కి చెం­దిన ప్ర­వీ­ణ్‌­బా­బు­గా గు­ర్తిం­చా­రు. ఈ ప్ర­మా­దం­లో ప్ర­యా­ణి­కు­లు వణి­కి­పో­యా­రు.

సత్యసాయి జిల్లాలో...

సత్య­సా­యి జి­ల్లా­లో మరో బస్సు ప్ర­మా­దం సం­భ­విం­చిం­ది. బెం­గ­ళూ­రు నుం­చి హై­ద­రా­బా­ద్ కు వస్తు­న్న జబ్బ­ర్ ట్రా­వె­ల్స్ బస్సు మా­ర్గ­మ­ధ్య­లో సత్య­సా­యి­జి­ల్లా­లో ప్ర­మా­దా­ని­కి గు­ర­య్యిం­ది. చె­న్నె కొ­త్త­ప­ల్లి మం­డ­లం దా­మా­జి­ప­ల్లి వద్ద వే­గం­గా వె­ళు­తు­న్న బస్సు ఒక్క­సా­రి­గా మరో వా­హ­నా­న్ని ఢీ­కొ­ట్టి ప్ర­మా­దా­ని­కి గు­ర­య్యిం­ది. ఈ ఘట­న­లో ఓ మహిళ మృ­తి­చెం­ద­గా 8 మంది ప్ర­యా­ణి­కు­ల­కు గా­యా­ల­పా­ల­య్యా­రు.

కరీంనగర్‌లో...

కరీం­న­గ­ర్‌­లో మరో ప్ర­మా­దం జరి­గిం­ది. తి­మ్మా­పూ­ర్ మం­డ­లం రే­ణి­గుంట బ్రి­డ్జి వద్ద ఆర్టి­సి బస్సు ప్ర­మా­దా­ని­కి గు­ర­య్యిం­ది... వే­గం­గా వె­ళు­తు­న్న బస్సు ముం­దు వె­ళు­తు­న్న ట్రా­క్ట­ర్ ను ఢీ­కొ­ట్టిం­ది. ఈ ప్ర­మా­దం­లో బస్సు­లో­ని 15 మంది ప్ర­యా­ణి­కు­ల­కు తీ­వ్ర గా­యా­ల­య్యా­యి. కరీం­న­గ­ర్ నుం­డి హై­ద­రా­బా­ద్ కు వె­ళు­తుం­డ­గా ఈ ప్ర­మా­దం జరి­గిం­ది.

Tags

Next Story