దొపిడీ దొంగకు ప్రజలు ఓట్లేసి తప్పు చేశారు: అచ్చెన్నాయుడు

దొపిడీ దొంగకు ప్రజలు ఓట్లేసి తప్పు చేశారు: అచ్చెన్నాయుడు
టీడీపీ ప్రభుత్వం సంక్షేమంతో పాటు సమానంగా అభివృద్ధి చేశామని అయితే చేసిన పనులను చెప్పుకోలేక పోయామన్నారు

అధికారంలో ఉన్నా..ప్రతిపక్షంలో ఉన్నా.. టీడీపీది ప్రజాపక్షమన్నారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. 2019లో ఓ దొపిడీ దొంగకు ప్రజలు ఓట్లేసి తప్పు చేశారని అన్నారు. టీడీపీ ప్రభుత్వం సంక్షేమంతో పాటు సమానంగా అభివృద్ధి చేశామని అయితే చేసిన పనులను చెప్పుకోలేక పోయామన్నారు. కోడి కత్తి డ్రామా,సొంత బాబాయిని చంపి ప్రజల సింపతితో జగన్ సీఎం అయ్యాడని, సీఎం జగన్‌ను వేటాడి వెంటాడి తరిమి కొట్టే రోజులు వచ్చాయని అన్నారు.151 స్థానాలు రావడంతో జగన్‌కు కళ్లు నెత్తికెక్కాయని,వచ్చే ఎన్నికల్లో 160 స్థానాలను టీడీపీ గెలుచుకోవడం ఖాయమన్నారు. వైఎస్ వివేకా చనిపోయిన విషయం జగన్‌కే ముందు తెలుసనిబాబాయ్ హత్య కేసు తమ మీదకు వస్తుందని జగన్ భయపడుతున్నాడని అన్నారు అచ్చెన్నాయుడు.

Tags

Read MoreRead Less
Next Story