SCHOOLS: ప్రభుత్వ పాఠశాలలో 'అడ్మిషన్స్ క్లోజ్డ్'

SCHOOLS: ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్స్ క్లోజ్డ్
X
వి­ద్యా రం­గం­లో గణ­నీ­య­మైన మా­ర్పు­లు

ఏపీ­లో కూ­ట­మి ప్ర­భు­త్వం అధి­కా­రం­లో­కి వచ్చి సం­వ­త్స­రం పూ­ర్తి­కా­క­ముం­దే వి­ద్యా రం­గం­లో గణ­నీ­య­మైన మా­ర్పు­లు కని­పి­స్తు­న్నా­యి. ఒక­ప్పు­డు పే­రు­కు మా­త్ర­మే ఉన్న ప్ర­భు­త్వ పా­ఠ­శా­ల­లు, ఇప్పు­డు ప్రై­వే­ట్, కా­ర్పొ­రే­ట్ స్కూ­ళ్ల­కు పో­టీ­గా ని­లు­స్తు­న్నా­యి. తా­జా­గా నె­ల్లూ­రు­లో­ని వీ­ఆ­ర్ ము­ని­సి­ప­ల్ ఉన్నత పా­ఠ­శా­ల­పై ఏర్ప­డిన వి­శ్వా­సం దా­ని­కి ని­ద­ర్శ­నం­గా ని­లి­చిం­ది. ఈ పా­ఠ­శా­ల­లో వి­ద్య­న­భ్య­సిం­చిన మం­త్రి పొం­గూ­రు నా­రా­యణ, పు­న­ర్ని­ర్మా­ణా­ని­కి స్వ­యం­గా శ్రీ­కా­రం చు­ట్టా­రు. అత్యా­ధు­నిక తర­గ­తి గదు­లు, మం­చి­నీ­టి సదు­పా­యా­లు, స్మా­ర్ట్ బో­ర్డు­లు, మంచి మౌ­లిక వస­తు­లు అం­దు­బా­టు­లో­కి తె­చ్చా­రు. ఉపా­ధ్యా­యుల కొరత లే­కుం­డా తగి­నంత టీ­చ­ర్ల­ను ని­య­మిం­చేం­దు­కు చర్య­లు తీ­సు­కు­న్నా­రు. ఈ అభి­వృ­ద్ధి­ని చూ­సిన తల్లి­దం­డ్రు­లు, తమ పి­ల్ల­ల­ను ప్ర­భు­త్వ స్కూ­ల్‌­లో­నే చే­ర్పిం­చా­ల­ని ని­ర్ణ­యిం­చు­కు­న్నా­రు. ఫలి­తం­గా కొ­త్త వి­ద్యా సం­వ­త్స­రం మొ­ద­ల­య్యే­లో­పే 90 శాతం సీ­ట్లు భర్తీ అయ్యా­యి. మి­గి­లి­న­వి కూడా వే­గం­గా భర్తీ కా­వ­డం­తో "అడ్మి­ష­న్స్ క్లో­జ్డ్" బో­ర్డు పె­ట్టా­ల్సి వచ్చిం­ది. వి­ద్యా­శాఖ మం­త్రి నారా లో­కే­శ్ ఈ ఫో­టో­ను సో­ష­ల్ మీ­డి­యా­లో షేర్ చే­స్తూ, ప్ర­భు­త్వ పా­ఠ­శా­ల­ల­పై పె­రు­గు­తు­న్న వి­శ్వా­సా­న్ని హర్షిం­చా­రు. ఈ వి­జ­యం ప్ర­భు­త్వ పా­ఠ­శా­లల పు­న­రు­జ్జీ­వ­నా­ని­కి మా­ర్గ­ద­ర్శ­కం­గా ని­లు­స్తోం­ది.

పాఠశాల చరిత్ర ఇది

నె­ల్లూ­రు నగ­రం­లో­ని వెం­క­ట­గి­రి రాజా వారి (వీ­ఆ­ర్) ఉన్నత పా­ఠ­శాల దా­దా­పు రెం­డు­న్నర శతా­బ్దాల చరి­త్ర కలి­గి ఉంది. ఈ పా­ఠ­శా­ల­లో చది­విన ఎంతో మంది ప్ర­యో­జ­కు­లు మారి గొ­ప్ప గొ­ప్ప స్థా­నా­ల్లో ఉన్నా­రు. అయి­తే ఈ స్కూ­ల్‌­లో­నే చది­విన మం­త్రి నా­రా­యణ... స్కూ­ల్ ఆధు­నిక సదు­పా­యా­ల­తో తీ­ర్చి­ది­ద్దా­ల­ని ని­ర్ణ­యిం­చా­రు. ఈ కమ్రం­లో­నే వి­ద్యా­ర్థుల కోసం ప్ర­త్యేక ప్ర­ణా­ళి­క­తో తర­గ­తి గదు­లు, డి­జి­ట­ల్ సదు­పా­యా­లు ఏర్పా­టు చే­సేం­దు­కు ముం­దు­కు వచ్చా­రు. పేద వి­ద్యా­ర్థు­ల­కు ఉన్నత స్థా­యి వి­ద్య అం­దిం­చేం­దు­కు వీ­ఆ­ర్ హై­స్కూ­ల్‌­ను ప్ర­పంచ నా­ణ్యత ప్ర­మా­ణా­ల­కు తగి­న­ట్లు అభి­వృ­ద్ధి చే­స్తు­న్న­ట్లు గతం­లో నా­రా­యణ తె­లి­పా­రు.

అభిప్రాయం మార్చుకోండి

సర్కా­రీ బడు­లం­టే పె­చ్చు­లూ­డిన గదు­లు, వి­రి­గి­పో­యిన బల్ల­లు, నలు­గు­రు వి­ద్యా­ర్థు­లు, ఒక ఉపా­ధ్యా­యు­డు అనే అపోహ చా­లా­మం­ది­లో ఉంది. కానీ నె­ల్లూ­రు జి­ల్లా­లో­ని ఓ ప్ర­భు­త్వ పా­ఠ­శా­ల­ జనా­లు క్యూ కడు­తు­న్నా­రు. వీ­ఆ­ర్ హై­స్కూ­ల్‌­లో తమ పి­ల్ల­ల­కు అడ్మి­ష­న్లు కా­వా­లం­టూ తల్లి­దం­డ్రు­లు తా­ప­త్ర­య­ప­డు­తుం­డ­గా.. సీ­ట్లు ఫుల్ కా­వ­టం­తో ఇలా అడ్మి­ష­న్స్ క్లో­జ్డ్ అంటూ బో­ర్డు పె­ట్టా­రు. జూన్ 23 నుంచి వీఆర్ మున్సిపల్ హైస్కూల్‌లో తరగతులు ప్రారంభం కానున్నాయి. ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకూ మూడు సెక్షన్లు చొప్పున విద్యార్థులను విభజించారు. మరోవైపు వీఆర్ మున్సిపల్ హైస్కూల్‌లోనే మంత్రి నారాయణ చదువుకోవటం విశేషం. తనకు విద్యాబుద్ధులు నేర్పించిన పాఠశాలను అభివృద్ధి చేయాలని ఆయన భావించారు. ఈ క్రమంలోనే మంత్రి నారాయణ కుమార్తెలు.. పాఠశాల ఆధునికీకరణలో భాగం పంచుకున్నారు.

Tags

Next Story