AMARAVATHI: ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత

AMARAVATHI: ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత
X
అమ­రా­వ­తి­కి చట్ట­బ­ద్ధత... కేంద్ర న్యాయ శాఖ ఆమోద ముద్ర

అమరావతిని ఏపీకి ఏకైక రాజధానిగా నిర్ధారిస్తూ గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలంటే ముందుగా ఏపీ పునర్ విభజన చట్టాన్ని సవరించాలి. ఈ చట్టంలో అమరావతే రాజధాని అనే మాట ఎక్కడా లేదు. దీంతో ఇప్పుడు ఆ చట్టాన్ని సవరించేందుకు కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచుతోంది. దీంతో పునర్ విభజన చట్టంలో మార్పులకు కేంద్ర న్యాయశాఖ ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగిసేలోపు ఈ బిల్లును లోక్ సభ, రాజ్యసభల్లో పెట్టి ఆమోదించాల్సి ఉంది.

న్యాయ శాఖ ఆమోదముద్ర

ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌ రా­జ­ధా­ని­గా అమ­రా­వ­తి­కి చట్ట­బ­ద్ధత కల్పిం­చే ప్ర­క్రియ మొ­ద­లైం­ది. ఏపీ రా­ష్ట్ర వి­భ­జన చట్టం­లో­ని 5(2)కి సవరణ చే­సేం­దు­కు కేం­ద్రం కొ­ద్ది­రో­జుల కిం­ద­టే చర్య­లు ప్రా­రం­భిం­చిం­ది. దీ­ని­కి ఇప్ప­టి­కే న్యా­య­శాఖ ఆమో­ద­ము­ద్ర లభిం­చిం­ది. కేం­ద్ర మం­త్రి­వ­ర్గం ఆమో­దం తర్వాత.. త్వ­ర­లో పా­ర్ల­మెం­టు­లో ప్ర­వే­శ­పె­ట్ట­ను­న్నా­రు. అక్కడ ఆమో­దం తర్వాత ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌ నూతన రా­జ­ధా­ని­గా అమ­రా­వ­తి­ని ప్ర­క­టి­స్తూ రా­జ­ప­త్రం (గె­జి­ట్‌) వి­డు­దల చే­స్తా­రు. వి­భ­జన తర్వాత ఏపీ రా­జ­ధా­ని­గా అమ­రా­వ­తి­ని తె­దే­పా ప్ర­భు­త్వం ఎం­పి­క­చే­సిం­ది. 29 గ్రా­మాల రై­తు­లు ముం­దు­కొ­చ్చి 34వేల ఎక­రా­లు స్వ­చ్ఛం­దం­గా ఇచ్చా­రు. సిం­గ­పూ­ర్‌ ప్ర­భు­త్వ సహ­కా­రం­తో మా­స్ట­ర్‌­ప్లా­న్‌ రూ­పొం­దిం­చా­రు. తె­దే­పా ప్ర­భు­త్వ హయాం­లో­నే అక్కడ అసెం­బ్లీ, సచి­వా­లయ భవ­నా­లు ని­ర్మిం­చి పాలన ప్రా­రం­భిం­చా­రు. పె­ద్దఎ­త్తున రహ­దా­రు­లు, భవ­నాల ని­ర్మా­ణం మొ­ద­లైం­ది. 2019లో వై­కా­పా అధి­కా­రం­లో­కి రా­వ­డం­తో.. అమ­రా­వ­తి పను­లు ని­లి­చి­పో­యా­యి.

Tags

Next Story