AMARAVATHI: కీలక దశకు అమ­రా­వ­తి చట్ట­బ­ద్దత

AMARAVATHI: కీలక దశకు అమ­రా­వ­తి చట్ట­బ­ద్దత
X
ఏపీ రాజధాని వివాదానికి శాశ్వత ముగింపు?... ఏపీ రాజధాని అమరావతికి లైన్ క్లియర్... చట్టబద్ధతకు కేంద్ర హోంశాఖ గ్రీన్ సిగ్నల్... త్వరలో పార్లమెంట్ ముందుకు అమరావతి బిల్లు

ఆం­ధ్ర­ప్ర­దే­శ్ రా­జ­ధా­ని­గా అమ­రా­వ­తి­కి చట్ట­బ­ద్ధత కల్పిం­చే ప్ర­క్రియ కీలక దశకు చే­రిం­ది. కేం­ద్ర హోం­శాఖ ఇప్ప­టి­కే ఆమో­దం తె­లి­పిన నే­ప­థ్యం­లో, కేం­ద్ర కే­బి­నె­ట్ ఆమో­దం­తో పా­ర్ల­మెం­టు­లో బి­ల్లు ప్ర­వే­శ­పె­ట్టేం­దు­కు మోదీ ప్ర­భు­త్వం సి­ద్ధ­మ­వు­తోం­ది. ఈ బి­ల్లు ఆమో­దం పొం­ది­తే ఏపీ రా­జ­ధా­ని వి­వా­దా­ని­కి శా­శ్వత పరి­ష్కా­రం లభిం­చ­నుం­ది. అమ­రా­వ­తి­ని ఆం­ధ్ర­ప్ర­దే­శ్ శా­శ్వత రా­జ­ధా­ని­గా ప్ర­క­టిం­చే ది­శ­గా కేం­ద్ర ప్ర­భు­త్వం ముం­ద­డు­గు వే­సిం­ది. కేం­ద్ర హోం­శాఖ గ్రీ­న్ సి­గ్న­ల్ ఇవ్వ­డం­తో, అమ­రా­వ­తి రా­జ­ధా­ని బి­ల్లు­ను కేం­ద్ర కే­బి­నె­ట్ ముం­దు ఉం­చేం­దు­కు చర్య­లు మొ­ద­ల­య్యా­యి. పా­ర్ల­మెం­టు ఆమో­దం­తో ఈ అం­శా­ని­కి పూ­ర్తి చట్ట­బ­ద్ధత కల్పిం­చా­ల­ని ఎన్డీఏ ప్ర­భు­త్వం భా­వి­స్తోం­ది. అమ­రా­వ­తి­ను ఆం­ధ్ర­ప్ర­దే­శ్ రా­జ­ధా­ని­గా చట్ట­బ­ద్ధం­గా ప్ర­క­టిం­చే ప్ర­క్రియ తుది దశకు చే­రు­కుం­ది. ఈ అం­శా­ని­కి సం­బం­ధిం­చిన ఫై­లు­కు కేం­ద్ర హోం­శాఖ ఇప్ప­టి­కే ఆమో­దం తె­ల­ప­డం­తో, అమ­రా­వ­తి రా­జ­ధా­ని బి­ల్లు­ను కేం­ద్ర కే­బి­నె­ట్ ముం­దు­కు తీ­సు­కు­వె­ళ్లేం­దు­కు మోదీ ప్ర­భు­త్వం సన్నా­హా­లు ప్రా­రం­భిం­చిం­ది. న్యా­య­శాఖ, పట్ట­ణా­భి­వృ­ద్ధి శా­ఖ­ల­తో పాటు మరి­కొ­న్ని కేం­ద్ర శాఖల అభి­ప్రా­యా­లు తీ­సు­కు­న్న అనం­త­రం ఈ బి­ల్లు­ను కేం­ద్ర కే­బి­నె­ట్‌­లో ఆమో­దా­ని­కి ఉం­చ­ను­న్నా­రు.

త్వరలోనే పార్లమెంట్ ముందుకు..

కే­బి­నె­ట్ ఆమో­దం లభిం­చిన తర్వాత పా­ర్ల­మెం­టు బడ్జె­ట్ సమా­వే­శా­ల్లో ఈ బి­ల్లు­ను ప్ర­వే­శ­పె­ట్టా­ల­ని కేం­ద్ర ప్ర­భు­త్వం యో­చి­స్తోం­ది. నరేం­ద్ర మోదీ నా­య­క­త్వం­లో­ని ఎన్డీఏ ప్ర­భు­త్వం ఉభ­య­స­భ­ల్లో పూ­ర్తి మె­జా­రి­టీ కలి­గి ఉం­డ­టం­తో, బి­ల్లు ఆమో­దం పొం­ద­డం దా­దా­పు లాం­ఛ­న­మే­న­ని రా­జ­కీయ వర్గా­లు భా­వి­స్తు­న్నా­యి. రా­ష్ట్ర వి­భ­జన చట్టం ప్ర­కా­రం రా­ష్ట్ర రా­జ­ధా­ని ఏ ప్రాం­తం­లో ఉం­డా­ల­నే ని­ర్ణ­యా­ధి­కా­రం రా­ష్ట్ర ప్ర­భు­త్వా­ని­దే. ఈ చట్టా­ని­కి అను­గు­ణం­గా 2014లో ఆం­ధ్ర­ప్ర­దే­శ్ ప్ర­భు­త్వం అమ­రా­వ­తి­ని రా­జ­ధా­ని­గా ఎం­పిక చేసి, భూమి పూజ, శం­కు­స్థా­పన కా­ర్య­క్ర­మా­లు కూడా ని­ర్వ­హిం­చిం­ది. అయి­తే తద­నం­త­రం రా­ష్ట్రం­లో చో­టు­చే­సు­కు­న్న పా­ల­నా మా­ర్పు­ల­తో అమ­రా­వ­తి అభి­వృ­ద్ధి ప్ర­క్రి­య­కు తీ­వ్ర జా­ప్యం ఏర్ప­డిం­ది. 2019లో అధి­కా­రం­లో­కి వచ్చిన వై­ఎ­స్సా­ర్ కాం­గ్రె­స్ పా­ర్టీ ప్ర­భు­త్వం మూడు రా­జ­ధా­నుల ప్ర­తి­పా­ద­న­ను ముం­దు­కు తె­చ్చిం­ది. దీం­తో అమ­రా­వ­తి భవి­ష్య­త్తు­పై అని­శ్చి­తి నె­ల­కొం­ది. ఈ ప్ర­తి­పా­దన రా­జ­కీ­యం­గా, న్యా­య­ప­రం­గా పె­ద్ద చర్చ­కు దా­రి­తీ­సి, రా­ష్ట్రం­లో రా­జ­ధా­ని అంశం తీ­వ్ర వి­వా­దం­గా మా­రిం­ది.దీంతో కూటమి ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది.

కూటమి అధికారంలోకి రాగానే...

అయి­తే 2024లో జరి­గిన ఎన్ని­క­ల్లో తె­లు­గు­దే­శం పా­ర్టీ నే­తృ­త్వం­లో­ని ఎన్డీఏ కూ­ట­మి అధి­కా­రం­లో­కి రా­వ­డం­తో పరి­స్థి­తి మా­రిం­ది. కొ­త్త ప్ర­భు­త్వం అమ­రా­వ­తి­నే ఏపీ ఏకైక రా­జ­ధా­ని­గా ప్ర­క­టి­స్తూ, దీ­ని­కి శా­శ్వత చట్ట­బ­ద్ధత కల్పిం­చా­ల­ని కేం­ద్రా­న్ని కో­రిం­ది. ఈ అం­శం­పై ఇటీ­వల ని­ర్వ­హిం­చిన అఖి­ల­ప­క్ష సమా­వే­శం­లో కూడా టీ­డీ­పీ ఇదే డి­మాం­డ్‌­ను స్ప­ష్టం­గా వ్య­క్తం చే­సిం­ది. రా­ష్ట్ర వి­భ­జన చట్టం ప్ర­కా­రం, పదే­ళ్ల­పా­టు ఉమ్మ­డి రా­జ­ధా­ని­గా కొ­న­సా­గిన హై­ద­రా­బా­ద్ గడు­వు 2024 జూన్ 2తో ము­గి­సిం­ది. దీం­తో ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­కు ప్ర­త్యే­క­మైన శా­శ్వత రా­జ­ధా­ని­ని అధి­కా­రి­కం­గా ప్ర­క­టిం­చా­ల్సిన అవ­స­రం ఏర్ప­డిం­ది. ఈ నే­ప­థ్యం­లో అమ­రా­వ­తి­ని ఏ తేదీ నుం­చి రా­జ­ధా­ని­గా ప్ర­క­టిం­చా­లో తె­లి­య­జే­యా­ల­ని కేం­ద్ర హోం మం­త్రి­త్వ­శాఖ రా­ష్ట్ర ప్ర­భు­త్వా­న్ని కో­రిం­ది.

కేంద్ర హోంశాఖ అనుమతి

హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా గడువు ముగిసిన తేదీ అయిన 2024 జూన్ 2 నుంచే అమరావతిని రాజధానిగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సూచించింది. దీనికి అనుగుణంగా విభజన చట్టానికి నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న కేంద్ర హోంశాఖ అన్ని సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖల నుంచి అభిప్రాయాలు సేకరించే ప్రక్రియ ప్రారంభించింది. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు రాజధానుల విధానంతో ఏర్పడిన గందరగోళానికి శాశ్వత ముగింపు పలకాలని ప్రస్తుత కూటమి ప్రభుత్వం భావిస్తోంది. భవిష్యత్తులో రాజకీయ మార్పులు జరిగినా రాజధాని అంశం మళ్లీ వివాదంగా మారకుండా ఉండాలంటే పార్లమెంటు చట్టబద్ధత అవసరమని ప్రభుత్వం స్పష్టంగా అభిప్రాయపడుతోంది.

Tags

Next Story