AMARAVATHI: అమరావతి రైల్వే లైన్‌పై ప్రజల ఆసక్తి

AMARAVATHI: అమరావతి రైల్వే లైన్‌పై ప్రజల ఆసక్తి
X
అమరావతి రైల్వే లైన్ ఏర్పాటుపై స్పష్టత... 57 కిలోమీటర్ల పొడవు... 2047కోట్ల ఖర్చు... 56.53 కిలోమీటర్ల దూరం రైల్వే లైన్

ఆం­ధ్ర­ప్ర­దే­శ్ రా­జ­ధా­ని అమ­రా­వ­తి­కి రై­ల్వే కనె­క్టి­వి­టీ­ని మరింత బలో­పే­తం చేసే కీలక ప్రా­జె­క్ట్‌­కు కేం­ద్ర ప్ర­భు­త్వం ఇప్ప­టి­కే ఆమో­దం తె­లి­పిం­ది. అమ­రా­వ­తి­ని నే­రు­గా జా­తీయ రై­ల్వే నె­ట్‌­వ­ర్క్‌­తో అను­సం­ధా­నిం­చే ప్ర­త్యేక రై­ల్వే లై­న్‌­కు గ్రీ­న్ సి­గ్న­ల్ రా­వ­డం­తో, ఈ ప్రా­జె­క్ట్‌­పై ప్ర­జ­ల్లో ఆస­క్తి పె­రు­గు­తోం­ది. అయి­తే ఈ రై­ల్వే లైన్ ఏ మా­ర్గం­లో సా­గు­తుం­ది, ఎక్క­డె­క్కడ స్టే­ష­న్లు ఏర్ప­డ­తా­యి, ఎప్పు­డు పూ­ర్త­వు­తుం­ది అనే అం­శా­ల­పై ఇప్ప­టి­వ­ర­కు స్ప­ష్ట­మైన సమా­చా­రం అం­ద­రి­కీ అం­ద­లే­దు. కేం­ద్ర ప్ర­భు­త్వ ఆమో­దం­తో ఈ అమ­రా­వ­తి రై­ల్వే లై­న్‌­ను 2024 నవం­బ­ర్ 8న అధి­కా­రి­కం­గా మం­జూ­రు చే­శా­రు. మొ­త్తం దా­దా­పు 56.5 కి­లో­మీ­ట­ర్ల పొ­డ­వు­తో ఈ లై­న్‌­ను ని­ర్మిం­చ­ను­న్నా­రు. ప్రా­జె­క్ట్ వ్య­యం సు­మా­రు రూ.2047 కో­ట్లు­గా అం­చ­నా వే­శా­రు. ఈ మొ­త్తా­న్ని పూ­ర్తి­గా ఇండియన్ రైల్వే భరి­స్తుం­డ­టం గమ­నా­ర్హం. అయి­తే రై­ల్వే లై­న్‌­కు అవ­స­ర­మైన భూ­మి­ని మా­త్రం ఆం­ధ్ర­ప్ర­దే­శ్ ప్ర­భు­త్వం సే­క­రిం­చి రై­ల్వే శా­ఖ­కు అప్ప­గిం­చా­ల్సి ఉం­టుం­ది.

ఈ కొ­త్త రై­ల్వే లైన్, మధిర–వి­జ­య­వాడ మా­ర్గం­లో­ని ఎర్రు­పా­లెం స్టే­ష­న్ నుం­చి ప్రా­రం­భ­మై, వి­జ­య­వాడ–గుం­టూ­రు మా­ర్గం­లో­ని నం­బూ­రు స్టే­ష­న్ వరకు ప్ర­త్యే­కం­గా ని­ర్మిం­చ­ను­న్నా­రు. ప్ర­స్తు­తం ఉన్న మా­ర్గా­ల­కు భి­న్నం­గా రా­జ­ధా­ని పరి­ధి­లో­ని గ్రా­మాల గుం­డా ఈ లైన్ సా­గ­నుం­ది. ఈ మా­ర్గం­లో పలు కొ­త్త రై­ల్వే స్టే­ష­న్ల­ను ఏర్పా­టు చే­య­ను­న్నా­రు.

పె­ద­పు­రం, చె­న్నా­రా­వు­పా­లెం, గొ­ట్టు­ము­క్కల, పరి­టాల, కొ­త్త­ప­ల్లి, వడ్డ­మా­ను, అమ­రా­వ­తి, తా­డి­కొండ, కొ­ప్ప­వ­రం వంటి ప్రాం­తా­ల్లో స్టే­ష­న్లు ఏర్పా­టు చే­యా­ల­నే ప్ర­తి­పా­దన ఉంది. దీం­తో రా­జ­ధా­ని ప్రాం­తం­లో­ని ప్ర­జ­ల­కు రై­ల్వే ప్ర­యాణ సౌ­క­ర్యం మరింత మె­రు­గ­వు­తుం­ద­ని అం­చ­నా వే­స్తు­న్నా­రు. ఈ లైన్ పూ­ర్త­యి­తే అమ­రా­వ­తి­కి రవా­ణా పరం­గా భారీ ప్ర­యో­జ­నం కల­గ­నుం­ది. ఎర్రు­పా­లెం మీ­దు­గా హై­ద­రా­బా­ద్‌­కు, నం­బూ­రు ద్వా­రా వి­జ­య­వాడ, గుం­టూ­రు, వి­శా­ఖ­ప­ట్నం, చె­న్నై, బెం­గ­ళూ­రు వంటి ప్ర­ధాన నగ­రా­ల­కు నే­రు­గా అను­సం­ధా­నం ఏర్ప­డు­తుం­ది. రా­జ­ధా­ని ప్రాం­తం­లో అభి­వృ­ద్ధి వేగం పె­ర­గ­డ­మే కా­కుం­డా, ఉద్యో­గా­లు, వా­ణి­జ్యం, వి­ద్య, పర్యా­టక రం­గా­ల­పై కూడా దీని ప్ర­భా­వం ఉం­డ­నుం­ద­ని ని­పు­ణు­లు భా­వి­స్తు­న్నా­రు. ప్ర­భు­త్వ వర్గాల సమా­చా­రం ప్ర­కా­రం, ఈ అమ­రా­వ­తి రై­ల్వే లై­న్‌­ను 2029 జన­వ­రి నా­టి­కి పూ­ర్తి చే­యా­ల­నే లక్ష్యం­తో ప్ర­ణా­ళి­క­లు రూ­పొం­దిం­చా­రు. అయి­తే ఈ గడు­వు పూ­ర్తి­గా రా­ష్ట్ర ప్ర­భు­త్వం చే­ప­ట్టే భూ­సే­క­రణ వే­గం­పై ఆధా­ర­ప­డి ఉం­టుం­ద­ని అధి­కా­రు­లు స్ప­ష్టం చే­స్తు­న్నా­రు. అవ­స­ర­మైన భూ­మి­ని త్వ­ర­గా రై­ల్వే శా­ఖ­కు అప్ప­గి­స్తే, ని­ర్మాణ పను­లు కూడా వే­గం­గా ప్రా­రం­భ­మ­య్యే అవ­కా­శ­ముం­ది. ఈ ప్రా­జె­క్ట్‌­పై ఇప్ప­టి­కే రా­ష్ట్ర ప్ర­భు­త్వం, రై­ల్వే శాఖ మధ్య పలు­మా­ర్లు చర్చ­లు జరి­గా­యి. చం­ద్ర­బా­బు­తో వి­జ­య­వాడ డి­వి­జ­న­ల్ రై­ల్వే మే­నే­జ­ర్ సహా ఉన్న­తా­ధి­కా­రు­లు సమా­వే­శ­మై ప్రా­జె­క్ట్ పు­రో­గ­తి­పై సమీ­క్షిం­చా­రు. రై­ల్వే లైన్ ని­ర్మా­ణం­పై ఇరు పక్షా­ల­కు స్ప­ష్టత ఉం­ద­ని చె­బు­తు­న్నా­రు.

Tags

Next Story