అమరావతి సచివాలయం, అసెంబ్లీ గేట్లను మూసివేసిన అధికారులు

X
By - Nagesh Swarna |9 Sept 2020 1:35 PM IST
అమరావతి సచివాలయం, అసెంబ్లీ గేట్లను అధికారులు మూసివేశారు. సచివాలయం గేట్ 1, అసెంబ్లీ గేట్ 2 లను మూసివేస్తూ అడ్డంగా గోడకట్టించారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా గేట్లను మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వరుసగా గేట్లను మూసివేస్తూ గోడ కట్టిస్తున్నారు. గతంలో వాస్తు పేరిట అసెంబ్లీ గేట్5, సెక్రెటేరియట్ ఉత్తర, దక్షిణ గేట్లను మూసివేసి.. అడ్డంగా గోడ కట్టించారు. ఇలా సచివాలయం, అసెంబ్లీలతో కలిపి మొత్తం ఐదు గేట్లను శాశ్వతంగా మూసివేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com