AMRUTHA: అమృత భావోద్వేగ పోస్ట్

ప్రణయ్ హత్య కేసులో నల్గొండ కోర్టు ఇచ్చిన తీర్పుపై అమృత స్పందించారు. ఇన్నేళ్ల నిరీక్షణ తర్వాత తమకు న్యాయం జరిగిందన్నారు. ఇకనుంచైనా పరువు పేరుతో జరిగే నేరాలు ఆగుతాయని ఆశిస్తున్నాని అన్నారు. ఈ ప్రయాణంలో తమకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. తన బిడ్డ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మీడియా ముందుకు రావట్లేదని, దయచేసి తమని అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అమృత భావోద్వేగాలతో నిండిన సందేశాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. “ఇన్నాళ్లుగా ఎదురుచూసిన న్యాయం నాకు చివరికి లభించింది. నా హృదయం భావోద్వేగాలతో నిండిపోయింది” అని అమృత తెలిపారు. కోర్టు తీర్పుతో తాను ఊపిరి పీల్చుకున్నానని, చాలా రోజులుగా ఎదురుచూస్తున్న న్యాయమే గెలిచిందని పేర్కొన్నారు.
అమృత ఇన్స్టా స్టోరీ వైరల్
ప్రణయ్ హత్య కేసులో కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. నిందితుల్లో ఒకరికి ఉరిశిక్ష, మిగిలిన వారికి జీవిత ఖైదు విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రణయ్ భార్య అమృత ఇన్స్టాగ్రామ్లో భావోద్వేగ పోస్ట్ చేశారు. నిన్నటి తేదీతోపాటు 'Rest in Peace Pranay' అంటూ రాసుకొచ్చారు. 2018లో తన కుమార్తె ప్రేమ వివాహం చేసుకున్నాడనే కారణంగా అమృత తండ్రి మారుతీరావు సుపారీ గ్యాంగ్తో ప్రణయ్ను హత్య చేయించాడు.
కృతజ్ఞతలు తెలిపిన అమృత
ఈ కేసులో తనకు అండగా నిలిచిన పోలీస్ శాఖ, న్యాయవాదులు, ఇంకా మీడియాకు అమృత హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. న్యాయం కోసం తనతో పాటు నిలిచిన ప్రతి ఒక్కరికీ ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్బంగా తన భర్త ప్రణయ్ను తలచుకుంటూ “ప్రశాంతంగా ఉండు ప్రణయ్” అని ఆమె సోషల్ మీడియా ద్వారా భావోద్వేగపూర్వకంగా ప్రకటించారు. ఈ సందేశం అందరినీ చలించిచేయడమే కాకుండా, ప్రణయ్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు తెలియజేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com