Anantapur : ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం

Anantapur : ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం

అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గంలో ఆర్టీసీ బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది.ఆర్టీసీ బస్సు కర్నూల్ నుంచి రాయదుర్గం వెళుతుండగా కళ్యాణదుర్గంలో డ్రైవర్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బస్సు డ్రైవింగ్ చేస్తూనే స్పృహ తప్పి పడిపోయాడు. అయితే తాను స్పృహతప్పే సమయంలోనూ డ్రైవర్ ఎంతో అప్రమత్తంగా ఉండటంతో పెద్ద ప్రమాదమే తప్పింది. స్పృహతప్పే కొద్ది నిమిషాల ముందే డ్రైవర్ బస్సును పక్కకు ఆపి స్టీరింగ్ మీద పడిపోయాడు. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ సమయంలో బస్సులో మొత్తం 54 మంది ప్రయాణికులు ఉన్నారు. వెంటనే ప్రయాణిలు, బస్ కండెక్టర్ కలిసి.. ఎదురుగా వస్తున్న మరో ఆర్టీసీ బస్సు డ్రైవర్ సహాయంతో అస్వస్థతకు గురైన డ్రైవర్‌ను కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రభుత్వాస్పత్రిలో డ్రైవర్ చికిత్స పొందుతున్నాడు.

Tags

Read MoreRead Less
Next Story