Andhra Pradesh : "దమ్ముంటే ఇంకో కేసు పెట్టండి"

X
By - Subba Reddy |11 Feb 2023 4:30 PM IST
ఎమ్మెల్యే పెద్దారెడ్డి కనుసన్నల్లోనే అధికారులు
తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి కనుసన్నల్లోనే అధికారులు పనిచేస్తున్నారని అన్నారు జేసీ ప్రభాకర్రెడ్డి. వారికి త్వరలోనే శిక్షలు పడే రోజులు ఉన్నాయని తెలిపారు. సాధారణంగా వాహనాలు రిజిస్ట్రేషన్ చేయాలంటే 11 రకాల నిబంధనలు పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. తమ వాహనాలను రిజిస్ట్రేషన్ చేసిన అధికారి తిరిగి తనపైన కేసు పెట్టారని, దమ్ముంటే మరో కేసు పెట్టాలని సవాల్ విసిరారు. ఇప్పటికే తాను 156 రోజులు జైల్లో బాధపడి వచ్చానన్నారు. మళ్లీ నకిలీ బీమాపై కేసు పెట్టాలని ఎమ్మెల్యే చెప్పడం అవివేకమని జేసీ వెల్లడించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com