Andhra Pradesh : కోడిపందాల్లో ఎమ్మెల్యేల వాహనాలు

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం రూరల్ కుంచనపల్లి నేషనల్ హైవేకి దగ్గరగా ఉన్న పొలాల్లో కోడిపందేలు జోరుగా సాగుతున్నాయి. అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు, మాజీ మంత్రుల కుమారులు సహా పలువురు ప్రముఖులు ఈ పందేల్లో పాల్గొన్నారన్న వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. ఎమ్మెల్యే స్టిక్కర్లు ఉన్న కార్లలో వచ్చి పందాల్లో పాల్గొంటున్నట్లు స్థానికులు చెప్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు 9 మందిని అరెస్టు చేశారు. 20 వేల నగదుతో పాటు రెండు కోళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఐతే కేసులో ప్రముఖులను తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు చర్చనీయాంశంగా మారింది. ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వ పెద్దలను వదిలేసి..పోలీసులు కేసును నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com