Andhra Pradesh : టీడీపీలో చేరిన కన్నా లక్ష్మీ నారాయణ

Andhra Pradesh : టీడీపీలో చేరిన కన్నా లక్ష్మీ నారాయణ
కన్నాతో పాటు దాదాపు 3 వేల మంది కార్యకర్తలు టీడీపీలోకి చేరారు. వారిందరికీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు చంద్రబాబు

కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలోకి చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ కండువా కప్పి కన్నా లక్ష్మీనారాయణను టీడీపీలోకి ఆహ్వానించారు. కన్నాతో పాటు దాదాపు 3 వేల మంది కార్యకర్తలు టీడీపీలోకి చేరారు. వారిందరికీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు చంద్రబాబు. అంతకుముందు.. కన్నా భారీ ర్యాలీతో గుంటూరు నుండి టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. ఇటు టీడీపీ శ్రేణులు.. అటు కన్నా అనుచరవర్గంతో పార్టీ కార్యాలయం నిండిపోయింది.

గుంటూరు జిల్లా రాజకీయాల్లో దశాబ్ధాలుగా కన్నా లక్ష్మీనారాయణ కీలకంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం కొనసాగిన ఆయన... ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. దాదాపు 15 సంవత్సరాల పాటు మంత్రిగా పని చేశారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు నుంచి నాలుగు సార్లు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఓ సారి గెలుపొందారు. కన్నాకు గుంటూరు జిల్లాలో విస్తృతమైన పరిచయాలు, భారీగా అనుచరులు ఉన్నారు. రాష్ట్ర విభజన పరిణామాలతో 2014లో బీజేపీలో చేరారు కన్నా లక్ష్మీనారాయణ. 2018లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు కన్నా. ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే జనసేన.. బీజేపీ పొత్తు ఖాయమైంది. ఐతే రాష్ట్ర అధ్యక్ష పదవీకాలం ముగిసిన తర్వాత పరిస్థితులు మారడంతో కన్నా తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఈ నేపథ్యంలోనే బీజేపీకి గుడ్‌ బై చెప్పి టీడీపీలో చేరారు..

Tags

Read MoreRead Less
Next Story