Andhra Pradesh : ఏపీ సర్కార్, మరో 2 వేల కోట్ల రుణం

Andhra Pradesh : ఏపీ సర్కార్, మరో 2 వేల కోట్ల రుణం

ఏపీ సర్కార్ మంగళవారం మరో 2 వేల కోట్ల రుణం సమీకరించింది. రిజర్వు బ్యాంకు నిర్వహించిన సెక్యూరిటీల వేలంలో పాల్గొని ఈ మేరకు అప్పు తీసుకుంది. ఏడేళ్ల కాలపరిమితితో తిరిగి చెల్లించేలా 7 శాతం వడ్డీకి వెయ్యి కోట్లు...పదేళ్ల కాలపరిమితితో 7.71 శాతం వడ్డీతో చెల్లించేలా మరో వెయ్యి కోట్ల రుణం తీసుకుంది. ఈ మొత్తం నిధులు ఇవాళ రాష్ట్ర ఖజానాకు చేరనున్నాయి. ఇప్పటికే ఓవర్‌ డ్రాఫ్ట్ పరిస్థితుల్లో ఉన్నందున ఈ రూపేణా నిధులు జమ చేసుకునే అవకాశమూ లేదని సమాచారం. తాజాగా కేంద్రం కొత్త రుణాలను అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో ఈ రుణం తీసుకునేందుకు జగన్ సర్కార్‌కు అవకాశం దక్కింది. కేంద్రం ఇచ్చిన అనుమతుల్లో మరో 929 కోట్ల మేర రుణం తీసుకునేందుకు అవకాశం ఉంది.

Tags

Read MoreRead Less
Next Story