Andhra Pradesh : అనుచరులతో కన్నా భేటీ

Andhra Pradesh : అనుచరులతో కన్నా భేటీ

అనుచరులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు కన్నా లక్ష్మీనారాయణ. బీజేపీకి గుడ్ బై చెప్పిన తర్వాత వరుస సమాావేశాలు నిర్వహిస్తుండటంతో తన భవిష్యత్ రాజకీయాలపై అనుచరులను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆయన నివాసంలో కీలక నేతలతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు జిల్లాలకు చెందిన కన్నా సానుభూతి పరులు పాల్గొన్నారు. ఈ భేటీలో పలు అంశాలపై నేతలతో చర్చించినట్లు తెలుస్తోంది.

కార్యకర్తలతో కన్నా భేటీ ముగియడంతో.. కాసేపట్లో తన రాజకీయ భవిష్యత్తుపై కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. ఇక ఈ నెల 23న చంద్రబాబు సమక్షంలో కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరనున్నట్లు సమాచారం. కన్నాకు గుంటూరు పశ్చిమ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తారకరత్న మృతి బాధాకరమన్న కన్నా.. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.



Tags

Next Story