AndhraPradesh: ఏలూరు కార్పొరేషన్లో అధికారుల దందా

X
By - Subba Reddy |21 Jan 2023 12:15 PM IST
అధికారపార్టీ నేతలతో కలిసి మరణ ధృవపత్రాల దందా...
ఏలూరు కార్పొరేషన్లో అవినీతి కోరలు చాస్తోంది. అధికారపార్టీ నేతలతో కలిసి ప్రభుత్వ ఉద్యోగులే జోరుగా దందాలు కొనసాగిస్తున్నారు. ఈ కోవలోనే మరణ ధృవపత్రాల దందా వెలుగు చూసింది.
డెత్ సర్టిఫికెట్ల జారీలో అధికారులు అధికార పార్టీ నేతలతో కలిసి పోటీ పడి మరీ చేతివాటం ప్రదర్శిస్తున్నారు.. కావలసిన వారి దగ్గర డబ్బులు తీసుకుని విచారణ జరపకుండానే డెత్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్న వైనం అందరినీ నివ్వెరపోయేలా చేస్తోంది. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో ఇన్ఛార్జ్ కమిషనర్, జాయింట్ కలెక్టర్ అరుణ్బాబు చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com