AndhraPradesh: రాజధాని విశాఖకు తరలిస్తే..సీమ చూస్తూ ఊరుకోదు

X
By - Subba Reddy |1 Feb 2023 3:30 PM IST
సీఎం జగన్ ప్రాంతాల మధ్య చిచ్చు రగిలించేలా చేస్తున్నాడు
పరిపాలన రాజధాని విశాఖకు తరలిస్తామంటే రాయలసీమ ప్రాంతవాసులు చూస్తూ ఊరుకోరన్నారు బీజేపీ నేత, మాజీ ఎంపీ టీజీ వెంకటేష్. సీఎం జగన్ ప్రాంతాల మధ్య చిచ్చు రగిలించేలా చేస్తున్నారని ఆరోపించారు. అభివృద్ధి లేక సీమ ప్రాంతం ఎంతో వెనుకబడిపోయిందని ఆవేదన చెందారు. తమ ప్రాంతంలో వింటర్ కేపిటల్ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్ తాను చెప్పిందే వేదం.. ఆదేశాలే హుకుం అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. తమను పిల్లిలా చూస్తే అవే పిల్లులు సింహాలుగా మారుతాయన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com