AndhraPradesh: శ్రీకాకుళం సముద్ర తీరంలో డ్రోన్ కలకలం

X
By - Subba Reddy |2 Feb 2023 12:00 PM IST
మత్స్యకారుల వలలో చిక్కిన టార్గెట్ బన్షీ
శ్రీకాకుళం జిల్లా సముద్ర తీరంలో డ్రోన్ కలకలం సృష్టించింది. భావనపాడు సమీపంలో మత్స్యకారుల వలలో ఈ డ్రోన్ చిక్కింది. చిన్నపాటి విమానాన్ని పోలి ఉన్న డ్రోన్ 111కేజీల బరువు 9 అడుగుల పొడవు ఉన్నట్లు మత్స్యకారుటు గుర్తించారు. దానిపై టార్గెట్ బన్షీ అని రాసిఉంది. దానిని వడ్డుకు తెచ్చిన జాలరులు మెరైన్ పోలీసులకు అప్పగించారు. దానిని పరిశీలించిన పోలీసులు మిలటరీ డ్రోన్ గా అనుమానించి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ శిక్షణ కోసం తయారు చేశారని, బన్షీ టెయిల్లెస్ మానవ రహిత విమానమని తెలిసింది. నిఘా కోసం ప్రయోగించినప్పడు విఫలమై సముద్రంలో పడి ఉండొచ్చని పోలీసుల భావిస్తున్నారు. దీని గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదని తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com