AndhraPradesh: GVMC ముందు విపక్షాల ధర్నా
By - Vijayanand |3 Feb 2023 10:39 AM GMT
ముసళ్లోవ పార్క్ మెయిన్ గేట్ వద్ద టీడీపీ, సీపీఐ శ్రేణులు నిరసన
విశాఖలోని జీవీఎంసీ పాలకవర్గం ముసళ్లోవ భూములను ప్రైవేటుపరం చేయడం వివాదాస్పదమవుతోంది. జీవీఎంసీ కౌన్సిల్ పీపీపీ పేరుతో ప్రైవేటు వారికి కట్టబెట్టడంపై ఆందోళన బాటపట్టాయి విపక్షాలు. పార్క్ మెయిన్ గేట్ వద్ద టీడీపీ, సీపీఐ శ్రేణులు నిరసన చేపట్టాయి. ఈ నిరసనలో టీడీపీ, సీపీఐ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నాయి. ఎమ్మెల్యే వెలగపూడి, మాజీ ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాస్, గండిబాబ్జీ, భీమిలి టీడీపీ ఇంఛార్జ్ రాజబాబులతో పాటు టీడీపీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Tags
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com