Tirupati: తిరుపతిలో స్కూల్ విద్యార్ధులు మిస్సింగ్..
By - Prasanna |9 Nov 2022 7:27 AM GMT
Tirupati: తిరుపతిలోని అన్నమయ్య ఇంగ్లీష్ మీడియంలో స్కూల్ విద్యార్థుల మిస్సింగ్ కలకలం రేపుతోంది.
Tirupati: తిరుపతిలోని అన్నమయ్య ఇంగ్లీష్ మీడియంలో స్కూల్ విద్యార్థుల మిస్సింగ్ కలకలం రేపుతోంది. ముగ్గురు బాలికలు, ఇద్దరు బాలురు అదృశ్యం అయ్యారు. నెలవారి పరీక్ష రాసిన విద్యార్థులు టిఫిన్ చేసేందుకు ఇంటికి వెళ్తున్నట్లు చెప్పి బయటకు వచ్చి కన్పించకుండాపోయారు.
విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మిస్సైన విద్యార్థులు గుణశ్రీ, మెహతాజ్, మౌనశ్రీ, అబ్దుల్ రెహ్మాన్, అతీఫ్ హుస్సేన్ గా గుర్తించారు. అతీఫ్ హుస్సేన్ 9వ తరగతి చదువుతుండగా, మిగతా విద్యార్థులు 10వ తరగతి చదువుతున్నట్లు తెలుస్తోంది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com