SUCIDE: పోలీస్‌ స్టేషన్‌లోనే ఎస్సై ఆత్మహత్య

SUCIDE:  పోలీస్‌ స్టేషన్‌లోనే  ఎస్సై ఆత్మహత్య
X
తుపాకితో కాల్చుకొని తణుకు రూరల్ ఎస్ ఐ ఆత్మహత్య... ఇటీవలే సస్పెండ్ అయిన ఎస్సై మూర్తి

తెలుగు రాష్ట్రాల్లో పోలీసుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. తుపాకీతో కాల్చుకొని తణుకు రూరల్ ఎస్ఐ ఏజీఎస్ మూర్తి స్టేషన్‌లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. మూర్తి ఇటీవల పలు ఆరోపణల నేపథ్యంలో సస్పెండ్ అయ్యారు. శుక్రవారం ఉదయం స్టేషన్కు వచ్చిన ఆయన తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. మరో ఎస్సై సూసైడ్ ఆంధ్రప్రదేశ్‌లో కలకలం రేగింది. సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని సబ్ ఇన్ స్పె్క్టర్ బలవన్మరణానికి పాల్పడ్డారు. తాను పని చేస్తున్న పోలీస్ స్టేషన్‌లోనే మూర్తి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన పశ్చిమగోదారి జిల్లా తణుకులో జరిగింది. తణుకు రూరల్ పోలీస్ స్టేషన్‌లో పని చేసిన ఎస్సై మూర్తిపై కొద్దికాలం క్రితం పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో అధికారులు మూర్తిపై సస్పెన్షన్ వేటు వేశారు. తాజాగా తణుకు రూరల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. అక్కడున్న తన తోటి సిబ్బందిని కలిశారు.

తోటీ పోలీసుల భావోద్వేగం

కొద్దిసేపటికే పోలీస్ స్టేషన్ నుంచి భారీగా శబ్ధం వినిపించింది. దీంతో మిగిలిన సిబ్బంది ఏం జరిగిందని చూసే సరికి షాకింగ్ ఘటన కంటపడింది. ఎస్సై మూర్తి తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఉన్నతాధికారులు తనను సస్పెండ్ చేయడం వల్లే మూర్తి మనస్థాపం చెందారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోలీస్ స్టేషన్‌కు వచ్చి బలవన్మరణానికి పాల్పడినట్లు సమాచారం. ఎస్సై మూర్తి మరణ వార్తతో తోటి సిబ్బంది కలత చెందారు. మూర్తితో ఉన్న పరిచయాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. మూర్తి ఇలా చేస్తాడని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఎస్సై మూర్తి మృతి చెందిన స్థలాన్ని అటు ఉన్నతాధికారులు కూడా పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Tags

Next Story