ఏఓబిలో టెన్షన్ టెన్షన్.. ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతి
![ఏఓబిలో టెన్షన్ టెన్షన్.. ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతి ఏఓబిలో టెన్షన్ టెన్షన్.. ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతి](https://www.tv5news.in/h-upload/2020/10/05/273864-maoists.webp)
By - Nagesh Swarna |13 Dec 2020 10:23 AM GMT
ఏఓబిలో టెన్షన్ టెన్షన్.. ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతిఏఓబిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. సింగారం అటవీ ప్రాంతంలో పోలీసు బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. స్పెషల్ ఆపరేషన్ గ్రూప్నకు చెందిన పోలీసులు విస్తృతంగా కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో మావోయిస్టులు కాల్పులు జరిపారు. పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో... ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు. . పరారైన మావోయిస్టులకు కోసం అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. ఈ ఎన్కౌంటర్తో మన్యం ప్రజలు హడలిపోయారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక బిక్కుబిక్కుమంటున్నారు.
Tags
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com