AP : జగన్‌ సర్కార్‌ పబ్లిసిటీ పీక్స్ కు చేరింది

AP : జగన్‌ సర్కార్‌ పబ్లిసిటీ పీక్స్ కు చేరింది
సర్కార్‌ అందిస్తున్న సంక్షేమ పధకాలు వైసీపీ సొంతం అన్నట్లు వ్యవహరిస్తున్న కొందరు ప్రజాప్రతినిధులు

జగన్‌ సర్కార్‌ పబ్లిసిటీ పిచ్చి పీక్స్‌కు చేరింది. ఏపీ సర్కార్‌ అందిస్తున్న సంక్షేమ పధకాలు వైసీపీ సొంతం అన్నట్లు వ్యవహరిస్తున్నారు కొందరు ప్రజాప్రతినిధులు. సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు, వాలంటీర్లు సమన్వయంతో అర్హులందరికీ అందించాలని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కర్నూలు మేయర్‌ బీవై రామయ్య ఆదేశించారు. కల్లూరు పట్టణానికి చెందిన సిబ్బందికి కర్నూలులో శిక్షణ శిబిరంనిర్వహించారు. ప్రతి ఇంటికి మా నమ్మకం నువ్వే జగన్‌ స్టిక్కర్‌ అతికించాలని చెప్పి స్వామి భక్తిని చాటుకున్నారు.

Tags

Next Story