AP: రెచ్చిపోయిన ఎమ్మెల్యే కన్నబాబు అనుచరులు

AP: రెచ్చిపోయిన  ఎమ్మెల్యే కన్నబాబు అనుచరులు
ఎమ్మెల్యే కన్నబాబు రాజు... మహిళా కార్యదర్శితో ఫోన్లో దురుసుగా మాట్లాడారు. ఆమె సచివాలయానికి రాకుండా ఎంపీడీవో ద్వారా మెమో జారీ చేయించారు.

అనకాపల్లి జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు అనుచరులు రెచ్చిపోయారు. ఓ మహిళా కార్యదర్శిపై కక్ష సాధింపు చర్యలకు దిగారు. మునగపాక మండలం పల్లపు ఆనందపురం సచివాలయ కార్యదర్శి సమీహ అహ్మద్‌ను 3 గంటల పాటు సచివాలయంలో నిర్బంధించారు. ఎమ్మెల్యే కన్న బాబురాజు ఫ్లెక్సీని తొలగించడం వివాదానికి దారి తీసింది. తనకు వ్యతిరేకంగా వ్యవహహించారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే కన్నబాబు రాజు... మహిళా కార్యదర్శితో ఫోన్లో దురుసుగా మాట్లాడారు. ఆమె సచివాలయానికి రాకుండా ఎంపీడీవో ద్వారా మెమో జారీ చేయించారు. అయితే.. విధులకు హాజరయ్యారని తెలిసి... తాళం వేయించారు. ఆమెను సచివాలయంలోనే ఉంచి... బయటి తాళం వేశారు స్థానిక వైసీపీ ఎంపీటీసీ.

సంక్రాంతి పండగ సమయంలో గ్రామంలో వైసీపీ నేతలు... ఎమ్మెల్యే కన్నబాబు రాజు, ఆయన కుమారుడు సుకుమార వర్మ ఫోటోలతో ఓఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అనుమతి లేకుండా.. ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీని తొలగించాలని సిబ్బందిని ఆదేశించినా... వైసీపీ ఎమ్మెల్యేది కావడంతో.. వెనుకంజ వేశారు. దీంతో కార్యదర్శి సమిహా స్వయంగా ఫ్లెక్సీని తొలగించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ... మహిళా కార్యదర్శికి ఫోన్‌ చేసి బెదిరింపులకు దిగారు. విధులకు హాజరుకాకుండా ఎంపీడీవో ద్వారా మెమో ఇప్పించారు. అయితే.. సమీహా యథావిథిగా విధులకు హాజరుకావడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానిక వైసీపీ నేతలు.. సచివాలయం నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. అయితే తాను కదిలేది లేదని కార్యదర్శి స్పష్టం చేయడంతో... ఎంపీటీసీ సభ్యురాలు సంజీవమ్మతో పాటు వైసీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. చివరికి మహిళా కార్యదర్శితో పాటు సచివాలయ ఉద్యోగులందరిని ఆఫీస్‌లోనే ఉంచి తాళాలు వేశారు. మూడు గంటల తర్వాత పోలీసులు వస్తున్నారని తెలిసి తాళాలు తీశారు..

Tags

Next Story