AP: ఎన్నికలకు సిద్ధం.. సీఎం బస్సు యాత్ర

X
By - Subba Reddy |8 Feb 2023 2:45 PM IST
ఏప్రిల్ నుంచి బస్సు యాత్రకు సిద్ధమౌతున్న సీఎం జగన్
ఆంధ్ర ప్రదేశ్లో అధికార పార్టీ వైసీపీ ఎన్నికలకు సమాయత్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ నుంచి సీఎం బస్సు యాత్రకు సిద్ధమవుతున్నారు. బస్సు యాత్రలో భాగంగా పల్లెనిద్ర, రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈనెల 13న మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలతో భేటీ జరగనుంది. 17న గడపగడపకు మన ప్రభుత్వం ఫైనల్ వర్క్ షాప్ ఉంటుంది. అనంతరం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత సీఎం బస్సు యాత్ర ఖరారు కానుంది. ప్రతి మండలంలోనూ పర్యటించే విధంగా షెడ్యూల్ రూపొందించనున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com