AP: వైసీపీ అనౌన్సర్గా మారిన ఉపాధ్యాయుడు

X
By - Subba Reddy |10 Feb 2023 12:00 PM IST
ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ను పొగుడుతూ ప్రశంసలు
విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన ఓ ఉపాధ్యాయుడు వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అంతేకాదు అధికార పార్టీ పాలకమండలి ప్రమాణస్వీకారంలో అనౌన్సర్గా మారి ఆశ్చర్య పోయేలా చేశాడు. మరో అడుగు ముందుకేసి స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ను పొగుడుతూ ప్రశంసలు కురిపించారు. ఇది చూసిన ప్రజలు టీచర్ మహేశ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్లో విధులు నిర్వహించాల్సిన టీచర్ మహేశ్ ఇలా అధికార పార్టీ కార్యక్రమాల్లో ఎలా పాల్గొంటాడంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం చిక్కాల గ్రామంలో వెలుగులోకి వచ్చింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com