AP: "కాపులు ఎటుంటే అధికారం అటే"
![AP: కాపులు ఎటుంటే అధికారం అటే AP: కాపులు ఎటుంటే అధికారం అటే](https://www.tv5news.in/h-upload/2023/02/10/896104-kanna.webp)
By - Subba Reddy |10 Feb 2023 10:00 AM GMT
ఎన్నికల సమయంలో ఓట్లు అవసరం కాబట్టి కాపుల్ని వాడుకుంటున్నారు
బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో 22 శాతం ఉన్న కాపులు ఎటు ఉంటే అటు అధికారం రావడం 1989 నుంచి చూస్తున్నామన్నారు. ఎన్నికల సమయంలోనే ఓట్లు అవసరం కాబట్టి కాపుల్ని వాడుకుంటున్నారని ఆయన తెలిపారు. కాపులకు రిజర్వేషన్ల డిమాండ్ సుధీర్ఘ కాలం నుంచి ఉందన్నారు. ఇక జనసేనను అధికారంలోకి తీసుకురావడంపై పవన్ నిర్ణయానికి వదిలేస్తే మంచిదని వెల్లడించారు. జీవీఎల్ ఏం సాధించారని కాపులతో సన్మానాలు చేస్తున్నారో అర్థం కావడం లేదని కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com