AP: సోము వీర్రాజుపై దళిత సంఘాల కేసు
By - Subba Reddy |20 Feb 2023 10:00 AM GMT
చినకాకాని గ్రామంలో సర్వే నెం.230 లో ఉన్న తమ స్థలాన్ని ఆక్రమించారని ఆరోపణ
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై గుంటూరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు దళిత సంఘాలు. చినకాకాని గ్రామంలో సర్వే నెం.230 లో ఉన్న తమ స్థలాన్ని ఆక్రమించారన్న బాధితులు. ఫిర్యాదు చేసేందుకు మంగళగిరి పోలీస్ స్టేషన్కు వెళితే పట్టించుకోలేదంటూ ఎస్పీకి కంప్లైంట్ చేశారు. అట్రాసిటి కేసు పెట్టినా పట్టించుకోలేదన్నారు. కబ్జా భూమిలో బీజేపీ ఆఫీస్ కట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని కబ్జా దారుల నుంచి తమకు రక్షించాలని ఎస్పీని కోరాయి దళిత సంఘాలు. గతంలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డిని కలసి ఇదే అంశంపై ఫిర్యాదు చేశామని ఆయన సానుకూలంగా స్పందిస్తారన్న నమ్మకం తమకు ఉందని అంటున్నాయి దళిత సంఘాలు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com