AP: పట్టాభికి ఏం జరిగినా డీజీపీదే బాధ్యత

X
By - Subba Reddy |21 Feb 2023 3:30 PM IST
టీడీపీ కార్యాలయాలపై జగన్ రెడ్డి గూండాలు దాడి చేస్తే పోలీసులు పట్టించుకోరని మండిపడ్డ అయ్యన్న
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి, పట్టాభి అరెస్టు ఘటనలపై మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు తీవ్రంగా స్పందించారు. పట్టాభికి ఎలాంటి హాని జరిగినా పూర్తి బాధ్యత డీజీపీదేనన్నారు. చూడటానికి వెళ్లిన పట్టాభిని అరెస్టు చేసిన పోలీసులు అతనిని ఎక్కడ ఉంచాలో చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ కార్యాలయాలపై జగన్ రెడ్డి గూండాలు దాడి చేస్తే పోలీసులు పట్టించుకోరని మండిపడ్డారు. డీజీపీ ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి ఇటువంటి వాటిని ప్రోత్సహించడం సరికాదన్నారు. టీడీపీ కార్యాలయం తమ ఇల్లు లాంటిదని, సొంత ఇంటి వద్ద గొడవ జరిగితే చూస్తూ ఊరుకోబోమని అయ్యన్న పాత్రుడు హెచ్చరించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com