AP : ఎమ్మెల్యే పయ్యావులకు భద్రత కల్పించాల్సిందే : హైకోర్టు

X
By - Vijayanand |22 Feb 2023 4:23 PM IST
తొలుత వన్ ప్లస్ వన్ సెక్యూరిటీ కల్పించాలని ఆదేశించిన హైకోర్టు.. విచారణ అనంతరం టూ ప్లస్ టూ సెక్యూరిటీ కల్పించడంపై ఆదేశాలు ఇచ్చింది.
ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్కు భద్రత కల్పించాల్సిందేనని హైకోర్టు ఆదేశించింది. ఐదు లేదా ఆరుగురు సెక్యూరిటీ సిబ్బంది పేర్లు ఇవ్వాలని పిటిషనర్కు సూచించింది. అందులో ఇద్దరిని సెక్యూరిటీగా నియమించేందుకు ఆదేశిస్తామని హైకోర్టు పేర్కొంది. గతంలో విచారణ సందర్భంగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించినా.. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడంపై పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అటు.. పిటిషనరే పేర్లు ఇవ్వాలని హైకోర్టు సూచించడంపై ప్రభుత్వ న్యాయవాది అభ్యంతరం తెలిపారు. పిటిషనర్కు నమ్మకం ఉండాలి కదా అని హైకోర్టు ప్రశ్నించింది. తొలుత వన్ ప్లస్ వన్ సెక్యూరిటీ కల్పించాలని ఆదేశించిన హైకోర్టు.. విచారణ అనంతరం టూ ప్లస్ టూ సెక్యూరిటీ కల్పించడంపై ఆదేశాలు ఇస్తామని తెలిపింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com