AP: గొప్పలకే నాడు-నేడు

AP: గొప్పలకే నాడు-నేడు
పాఠశాలల రూపురేఖలు మార్చామని జగన్‌ సర్కార్‌ ఓ వైపు గొప్పలు పోతుంటే క్షేత్ర స్థాయిలో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నం

నాడు-నేడు పథకం కింద పాఠశాలల రూపురేఖలు మార్చామని జగన్‌ సర్కార్‌ ఓ వైపు గొప్పలు పోతుంటే క్షేత్ర స్థాయిలో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఓ వైపు విద్యా సంవత్సరం ముగుస్తుండగా టీచర్లు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి దుప్పుల వాడ గ్రామంలోని మండల పరిషత్‌ అప్పర్ ప్రైమరీ స్కూల్‌లో ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. స్కూల్‌లో 138 మంది విద్యార్థులున్నప్పటికీ ఒక్క ఉపాధ్యాయుడు లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులను నియమించకపోతే స్కూల్‌కు తాళాలు వేసి ఆందోళన చేపడతామంటూ విద్యార్థుల తల్లిదండ్రులు హెచ్చరించారు.

Tags

Read MoreRead Less
Next Story