AP: లిక్కర్, అక్రమ మైనింగ్‌కు సీఎం జగన్‌ బ్రాండ్ అంబాసిడర్‌

AP: లిక్కర్, అక్రమ మైనింగ్‌కు సీఎం జగన్‌ బ్రాండ్ అంబాసిడర్‌
సీఎం జగన్‌పై టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ఫైర్

సీఎం జగన్‌పై టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ఫైరయ్యారు. లిక్కర్, అక్రమ మైనింగ్‌కు జగన్‌ బ్రాండ్ అంబాసిడర్‌గా మారరని విమర్శించారు. ఇక పులి అని డబ్బాలు కొట్టుకుంటున్న జగన్‌కు పొత్తులంటే ఎందుకు భయమని ప్రశ్నించారు. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో జగన్‌కు పెట్టుబడులు గుర్తుకు వచ్చాయని... అయితే వైసీపీ రాక్షస పాలనలో పెట్టుబడులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. ఇక రాష్ట్రంలో పోలీసుల పాలన కొనసాగుతుందన్న కన్నా... టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story