AP: పోలవరంలో పెట్రేగిపోతున్న మైనింగ్ మాఫియా
![AP: పోలవరంలో పెట్రేగిపోతున్న మైనింగ్ మాఫియా AP: పోలవరంలో పెట్రేగిపోతున్న మైనింగ్ మాఫియా](https://www.tv5news.in/h-upload/2023/03/07/915602-polavaram.webp)
పోలవరంలో మైనింగ్ మాఫియా పెట్రేగిపోతుంది. వేల టన్నుల గ్రావెల్ను అక్రమ తరలించేస్తోంది మైనింగ్ మాఫియా. అక్రమార్కులు కాలువ గట్లను ఇష్టానుసారంగా కొల్లగొడుతున్నారని, దీంతో పోలవరం ప్రమాదకర స్థాయికి చేరుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఉన్నతాధికారులకు అనేకసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు మాజీ సైన్యాధికారి పిల్లి సురేంద్ర. పోలవరంలో జరుగుతున్న అక్రమాలను హైకోర్టు దృష్టి తీసుకెళ్లినట్లు తెలిపారు న్యాయవాది పాలేటి ఉమామహేశ్వరరావు. దీనికి సంబందించి వీడియోలు సైతం హైకోర్టు ఇచ్చినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు 850 కోట్ల గ్రావెల్ను తరలించారని హైకోర్టకు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. అక్రమమైనింగ్పై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు మైనింగ్ నిలుపుదల చేయాలంటూ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఇరిగేషన్ అధికారులుకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com