AP : రామతీర్థంపై ప్రభుత్వం అలసత్యం

X
By - Vijayanand |30 March 2023 5:24 PM IST
ఉత్తరాంధ్ర భద్రాద్రిగా పేరు పొందిన రామతీర్థం ఆలయం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ట్రస్టు బోర్డు ఏర్పడి ఏడాది గడుస్తున్నా ఒక్కసారి కూడా సమావేశం ఏర్పాటు చేయకుండా దేవాదాయ శాఖ అధికారులు అలసత్వం వహిస్తున్నారు. ఆలయ ధర్మకర్తగా ఉన్న అశోక్ గజపతిరాజు నేతృత్వంలోని ఆలయ అర్చకుడితో కలిపి వైసీపీకి సంబంధించిన 8 మంది సభ్యులతో పాలక మండలి ఏర్పడింది. ఇందులో మెజారిటీ సభ్యులు వైసీపీకి చెందిన వారు కావడంతో కావాలనే సమావేశాలు ఏర్పాటు చేయకుండా ఒత్తిడి చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. మరోవైపు ఆలయానికి ఎదురుగా ఉన్న శేషాచలం కొండపై రాముడి విగ్రహాన్ని ఖండించిన ఘటనకు రెండేళ్లు పూర్తయినా ఇప్పటికీ నిందితులను పట్టుకోలేకపోయారు. దీంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com