AP : టీడీపీ నేత ఇంటికి సుజనాచౌదరి

X
By - Vijayanand |2 April 2023 5:36 PM IST
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ మాజీ మంత్రి ఆలపాటి ఇంటికి వెళ్లారు బీజేపీ నేత సుజనాచౌదరి. ఆ సమావేశంలో కన్నా లక్ష్మీనారాయణ, నక్కా ఆనంద్బాబు పాల్గొన్నారు. కీలక అంశాలపై వారు చర్చించినట్లు తెలుస్తోంది. వైసీపీ సర్కార్ను తరిమేస్తేనే ఏపీకి మంచి రోజులన్నారు సుజనాచౌదరి. అమరావతిలో సత్యకుమార్పై దాడి చేయడం దారుణమన్న ఆయన.. వైసీపీకి ప్రజలు బుద్ది చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. వైసీపీ తీరు మార్చుకుంటే మంచిదని హెచ్చరించారు. ఏపీ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందన్నారు ఆలపాటి రాజా. రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోతుందేమోనన్న ఆందోళన ఉందన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యవాదులు, ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com