AP : అధికారిక లాంఛనాలతో నేవీ కమాండర్ గోవింద్ అంత్యక్రియలు

AP : అధికారిక లాంఛనాలతో నేవీ కమాండర్ గోవింద్ అంత్యక్రియలు
విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం పర్ల గ్రామంలో గోవింద్ అంత్యక్రియలు జరిగాయి

అధికారిక లాంఛనాలతో నేవీ కమాండర్ గోవింద్ అంత్యక్రియలు ముగిశాయి. సైనిక వందనం చేసి ఘనంగా నివాళులు అర్పించారు నేవీ అధికారులు. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం పర్ల గ్రామంలో గోవింద్ అంత్యక్రియలు జరిగాయి.కడసారి నివాళులు అర్పించేందుకు భారీగా పర్ల గ్రామానికి చేరుకున్నారు ప్రజలు, అధికారులు. గోవింద్‌ పార్థీవ దేహాన్ని చూసిన స్థానికులు కన్నీటి పర్యంతం అయ్యారు.

పశ్చిమ బెంగాల్‌లోని బంకురా జిల్లాలో ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో పారాట్రూపర్స్ ట్రైనింగ్ టీమ్‌లో కమాండో గోవింద్ విధులు నిర్వహిస్తున్న ఆయన శిక్షణలో భాగంగాఎయిర్‌క్రాఫ్ట్ నుంచి కిందకి దూకగా.. పారాచ్యూట్ పూర్తిగా తెరుచుకోలేదు. దీంతో తీవ్ర గాయాలై మృతి చెందారు. గోవింద్‌ స్వగ్రామం విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం పర్ల గ్రామం. గత ఏడాది గోవింద్‌ తండ్రి చనిపోయినప్పటి నుంచి కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్నారాయన.ప్రమాదంలో గోవింద్‌ కూడా చనిపోవడంతో కుటంబంలొ విషాదచాయలు అలముకున్నాయి.

Tags

Next Story