AP: జర్నలిస్టుల స్థలాల్లో అక్రమ తవ్వకాలను ఆపాలి: సీపీఐ రామకృష్ణ
By - Subba Reddy |8 April 2023 3:00 AM GMT
కర్నూలు నగర శివారులోని జగన్నాథ గుట్టలో.. జర్నలిస్టులకు కేటాయించిన స్థలాలను సీపీఐ రామకృష్ణ పరిశీలించారు. జగన్నాథ గుట్టలో అక్రమ మట్టి తవ్వకాలను వెంటనే నిలిపివేయాలన్న ఆయన.. లేకపోతే ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు. ఇంత జరుగుతున్నా పాలకులు, అధికారులు పట్టించుకోక పోవడంపై రామకృష్ణ మండిపడ్డారు. ఇదే అంశంపై సీఎం జగన్కి లేఖ రాస్తామన్న రామకృష్ణ.. స్పందించకపోతే చర్యలు తీసుకోకపోతే ఉద్యమం ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com