AP : పోలవరం పరిహారంలో వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు
By - Vijayanand |8 April 2023 9:50 AM GMT
అల్లూరి సీతారామరాజు జిల్లా వీఆర్పురం మండలం చొప్పల్లి గ్రామస్తులు ఆందోళనకు దిగారు. పోలవరం పరిహారం విషయంలో వైసీపీ ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వరదలు వచ్చిన ప్రతిసారి తమకు ఇబ్బందులు తప్పడం లేదన్నారు. వదరలు వచ్చినప్పుడల్లా గ్రామాన్ని ఖాళీ చేసి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మరోసారి వదరలు రాకముందే తమకు పరిహారం చెల్లించే వేరే ప్రాంతాలకు తరలించాలని వేడుకుంటున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com