AP : తాడిపత్రి పోలీస్టేషన్‌లో జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆందోళన

AP : తాడిపత్రి పోలీస్టేషన్‌లో జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆందోళన
X

అనంతపురం జిల్లా తాడిపత్రి రూరల్ పోలీస్టేషన్‌లో జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆందోళనకు దిగారు. స్థానిక ఎమ్మెల్యే అనుచరుల మట్టి అక్రమ రవాణాను ప్రశ్నించిన.. జూటూరుకు చెందిన ముగ్గురు యువకుల ఫోన్లను పోలీసులు లాక్కున్నారు. దాంతో పోలీసుల తీరుపై మండిపడిన జేసీ ప్రభాకర్‌రెడ్డి.. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఎస్సీ, సీఐలను నిలదీశారు. ఎమ్మెల్యే మట్టి అక్రమ రవాణాను ప్రశ్నిస్తే బెదిరిస్తారా? అంటూ మండిపడ్డారు. ఇక జేసీ ప్రభాకర్‌రెడ్డి నిరసనతో దిగొచ్చారు పోలీసులు. ఎమ్మార్వోతో మాట్లాడి రేపటి లోపు మట్టి అక్రమ రవాణాపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారని జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. లేకుంటే ఎల్లుండి నుంచి ప్రత్యక్ష పోరాటం చేస్తామని హెచ్చరించారు.

Next Story