AP : జగన్ ప్రభుత్వంపై సోము వీర్రాజు ఫిర్యాదు
![AP : జగన్ ప్రభుత్వంపై సోము వీర్రాజు ఫిర్యాదు AP : జగన్ ప్రభుత్వంపై సోము వీర్రాజు ఫిర్యాదు](https://www.tv5news.in/h-upload/2023/04/09/940726-8546845.webp)
By - Vijayanand |9 April 2023 11:29 AM GMT
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ పూరి సింగ్ను ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కలిశారు.. ఏపీలో కేంద్ర సహకారంతో నిర్మాణమవుతున్న ఇళ్లు నత్తనడకన సాగుతున్న తీరుపై ఆయనకు ఫిర్యాదు చేశారు.. ఇతర రాష్ట్రాల కంటే ఏపీకి ఎక్కువ ఇళ్లను కేంద్రం కేటాయించిందని ఆయన అన్నారు.. కేంద్ర మంత్రికి ఏపీ ప్రభుత్వంపై ఫిర్యాదు చేశామన్నారు.. వెంటనే సమీక్ష నిర్వహించాలని కోరారు.. రాష్ట్రంలో పర్యటించి పరిశీలన చేయాలని కోరామన్నారు.. కేంద్ర సహకారంతో జరుగుతున్న ఇళ్లకు వైసీపీ కలర్లు వేస్తున్నారు.. ప్రధాని ఆవాస్ యోజన అనే బోర్డు లేకుండా వైసీపీ ఇళ్లుగా మార్చేశారని సోము వీర్రాజు మండిపడ్డారు.. రేపు కేంద్ర జలశక్తి మంత్రిని కలిసి పోలవరంపై ప్రస్తుత పరిస్థితులు, వాస్తవాలు తెలుసుకుంటామన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com