AP : గుడివాడలో టెన్షన్... టీడీపీ శ్రేణులపై వైసీపీ వర్గీయులు దాడి

X
By - Vijayanand |13 April 2023 7:09 PM IST
గుడివాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది. శరత్ థియేటర్ దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. టీడీపీ శ్రేణులపై వైసీపీ వర్గీయులు దాడికి దిగారు. వైసీపీ జెండాలతో టీడీపీని తిడుతూ కార్య కర్తలు హల్చల్ చేస్తున్నారు. మాజీ ఎంపీ మాగంటి బాబు అనుచరులు అడ్డుకోవడంతో వివాదం తలెత్తగా.. శరథ్ థియేటర్ దగ్గర రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీ సులు ఇరువర్గాలన్ని చెదరగొట్టాయి. కవ్వింపు చర్యలకు దిగొద్దని వైసీపీ వర్గీయుల్ని పోలీసులు కోరుతున్నారు. కాసేపట్లో వైసీపీ ఆఫీస్ మీదుగా చంద్రబాబు రోడ్ షో ప్రారంభంకానుంది. చంద్రబాబు టూర్తో గుడివాడ పసుపుమయంగా మారింది. ఇక ఇరువర్గాలు ఘర్షణకు దిగడంతో భారీగా పోలీసులు, ప్రత్యేక బలగాలు గుడివాడకు చేరుకున్నాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com