AP : సింహాద్రి అప్పన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు

X
By - Vijayanand |23 April 2023 6:24 PM IST
సింహాద్రి అప్పన్న స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వాహనాలతో సింహ గిరి ఘాట్ రోడ్డు నిండిపోయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. మరోవైపు దర్శనానికి అనుమతించకపోవడంతో వికాలాంగులు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు. ఆలయ అధికారుల తీరును నిరసిస్తూ ధర్నా చేపట్టారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ప్రభుత్వంలో ఇలాంటి పరిస్థితులు వచ్చాయంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. స్వామివారి దర్శనానికి అనుమతించకపోవడంతో భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com