AP : జగన్ పర్యటనతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు
By - Vijayanand |6 May 2023 8:19 AM GMT
నెల్లూరు జిల్లాలో ఈనెల 12న సీఎం జగన్ పర్యటించనున్నారు. ఐతే.. ముఖ్యమంత్రి పర్యటనతో కావలి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. సీఎం పర్యటనకు వారం రోజుల ముందే తుమ్మలపెంట రోడ్.. జడ్పీ గ్రౌండ్ వద్ద అధికారులు షాపులను మూయించారు. అవసరమైతే షాపులు తొలగించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఐతే.. యంత్రాలతో షాపులు తొలగిస్తే ధ్వంసం అవుతాయని.. రోడ్డున పడతామని షాపుల నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com